Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ పరిస్థితి ఇదీ...!
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత బండ్ల గణేష్ అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'. శివబాబు బండ్ల సమర్పకుడు. కన్యా కుమారి, పొలాచ్చి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ రామానాయుడు సినీవిలేజ్లో భారీ సెట్ నిర్మించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ చేసారు. కొంత షెడ్యూల్ బ్రేక్ తర్వాత జూన్ 5 నుండి తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు అనగానే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఎలా గుర్తొస్తారో...నటుడు ప్రకాష్ రాజ్, జయసుధ కూడా అలాగే గుర్తొస్తారు. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. మరోసారి ఈ జంట గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రాంచరణ్, కాజల్ జంటగా మా బ్యానర్లో నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' తదుపరి షెడ్యూల్ ని జూన్ 5 నుండి చేస్తున్నాము. ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూటింగ్ చేయనున్నాము. ఈ షెడ్యూల్ అనంతరం యూనిట్ మొత్తం లండన్ షూటింగ్ కి వెళ్తారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ల మధ్య ప్రతి సన్నివేశం ఆధ్యంతం నవ్విస్తూ ఆకట్టుకుంటాయి. చక్కటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట కృష్ణ వంశీ. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని తెలుగు సాంప్రదాయాలకు అద్దంపట్టేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్, కాజల్, శ్రీకాంత్ ఇలా ప్రతి ఒక్కరి వేషాలంకరణలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కృష్ణ వంశీ. మా లిటిల్ బాస్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అమితమైన రెస్పాన్స్ రావడమే దీనికి నిదర్శనం. ఈ ఫస్ట్ లుక్ తరువాత ట్రేడ్లో బిజినెస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం విశేషం. రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ బిజినెస్ ఈ చిత్రం చేయబోతుందనడంలో సందేహం లేదు అని తెలిపారు.
సమ్మర్ గ్యాపులో షూటింగుకి కాస్త విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్యాపులో సంగీత దర్శకుడు యువన్ మూడు పాటలను రికార్డ్ చేసారు. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. గోవిందుడు అందరి వాడేలే చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్, శ్రీను వైట్ల , నిర్మాత డివివి దానయ్య కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.