twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ హీరోయిన్ పోసాని కృష్ణమురళితో రొమాన్స్

    By Staff
    |

    గోపిచంద్, పరుచూరి మురళి కాంబినేషన్లో వచ్చిన 'ఆంధ్రుడు' లో హీరోయిన్ గా చేసిన గౌరిపండిట్‌ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె దాదాపు నాలుగేళ్ళ అనంతరం మళ్ళీ 'నిత్య పెళ్లి కొడుకు' అనే చిత్రం ఒప్పుకుంది. ఆ చిత్రంలో నటడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి హీరోగా చేస్తున్నారు. ఇక గౌరీ పండిట్ తనకు గ్యార్ రావటానిక కారణం వివరిస్తూ ఆంధ్రుడు తర్వాత తనకు ఆఫర్స్ వచ్చినా కావాలనే రిఫ్యూజ్ చేసాను. నేను ఆ టైమ్ లో చాలా కన్ఫూజ్ గా ఉన్నాను. ఆ సినిమా ఊహించిన విధంగా ఆడలేదు. దాంతో డెషిసన్ తీసుకోలేకపోయాను. నాకు అలవాటైన మోడలింగ్ లోనే కంటెన్యూ అయిపోయాను. ఆ తర్వాత హౌస్ ఫుల్ చిత్రం చేసాను. అదీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఆకాశరామన్న చిత్రం చేసాను. ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నాను అంది. ఇక పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి మరో హీరోయిన్. అళహరి దర్శకత్వంలో జి.వి.సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X