Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలకృష్ణ కుమార్తె వివాహ కళ్యాణ మండపం..వివరాలు
ఈ మండపాన్ని దాదాపు నలభై ఐదు రోజులుగా నూట డబ్బై ఐదు మంది కష్టపడి తయారు చేస్తున్నారు. అలాగే ఈ మండపం హైలెట్స్ లో ..హ్యాంగింగ్ వాటర్ పౌంటెన్స్ చోటు చేసుకోనున్నాయి. వివాహానికి వచ్చే ఆహాతులను ఈ వాటర్ ఫౌంటన్స్ ఆశ్చర్యపరిచి ఆకట్టుకుంటాయని అంటున్నారు. అలాగే ఈ కల్యాణ మండపానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 15 వేల మందికి సరపడా ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్తో తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్లోని హైటెక్స్లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు.
సినీ నటుడు బాలకృష్ణ తన కుమార్తె వివాహానికి అభిమానులందరినీ ఆహ్వానించారు. నందమూరి కుటుంబ అభిమానులంతా పెళ్లికి రావాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం భరత్తో ఈనెల 21న ఉదయం 8:25 నిమిషాలకు మాదాపూర్లోని హైటెక్స్లో జరగనుంది. పత్రికా ప్రకటననే వ్యక్తిగత ఆహ్వానంగా భావించాలని కోరారు.