Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ తో సహా అంతా స్టేజీపై ఏడుపు, ఇది మర్డరే
ముంబై: సినిమా ఫెయిలైతే భాధపడుతూంటారు. అయితే ఎక్సపెక్ట్ చేసిన సినిమా ధియేటర్లోకి వెళ్లకముందే లీక్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్దితి బాలీవుడ్ చిత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీది. ఈ చిత్రం రిలీజ్ కు ముందే నెట్ లో వచ్చేసింది. దాంతో వందకోట్లు వస్తుందనుకున్న సినిమా మూడు కోట్లు దగ్గర ఆగిపోయింది. ఇది చూసిన యూనిట్, హీరో,హీరోయిన్స్ తో అంతా స్టేజీపై కన్నీరు పెట్టేసుకున్ారు.
'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ధియోటర్లలో రిలీజ్ చేసారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
తొలి రోజు కనీసం 15 కోట్ల వసూళ్లు సాధిస్తుందనుకున్న సినిమా 2 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ పైరసీ వల్ల తమకు జరిగిన నష్టాన్ని అభిమానులకు తెలియజేశారు.
ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా 'సినిమా 17 రోజుల ముందే లీక్ అయిపోయింది. అది చూసిన అందరూ సూపర్బ్ గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది.