టాయిలెట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్?
బాలీవుడ్ భామ గుల్ పనాగ్ తాజాగా ఇటీవల శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా టాయిలెట్లో ఇరుక్కుపోయింది. చెప్పుకోవటానికి ఎబ్బెట్టుగా అనిపించిన ఆ అనుభవాలను “ట్విట్టర్" లో ఇలా రాసుకుంది.."శతాబ్ది ఎక్స్ప్రెస్ టాయిలెట్ లో ఇరుక్కుపోయాను. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. సిగ్గుతో చచ్చిపోయాను. తరువాత ఎలాగోలా బయట పడ్డాను అంది. ఇక గుల్ పనాగ్ రెండు నెలల క్రితం రిలీజైన రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రణ్" లో నటించింది. మరో హిందీ సినిమాలు చేస్తున్న ఆమె ఆ సంఘటన తర్వాత ట్రైన్ ప్రయాణం అంటే భయమేస్తోందంటూ చెప్పుకొస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కొద్ది వారాల క్రితం ప్రీతి జింటా విషయం లో జరిగింది.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ ప్రీతీ జింతా గుల్ పనాగ్ శతాబ్ది ఎక్సప్రెస్ రణ్ ట్విట్టర్ gul panag ram gopal varma preity zinta shatabdi train rann


Click it and Unblock the Notifications











