Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
మెగా అభిమానులకు జవాబిచ్చిన గుణశేఖర్ వైఫ్...
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి'. ఈ సినిమాకు నిర్మాత ఆయన భార్య నీలిమ గుణ. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 9న విడుదలైంది. ఉహించినట్లుగానే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
దాదాపు 80 కోట్ల పెట్టుబడితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దసరా సీజన్లో బరిలో పెద్ద సినిమాలు ఏమీ లేకుంటే రుద్రమదేవి పెట్టుబడి తిరిగి వచ్చి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు కేవలం వారం గ్యాపుతోనే రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కాస్త ఆందోళన నెలకొంది.
ఇటీవల ‘రుద్రమదేవి' ప్రెస్ మీట్లో పాల్గొన్న దాసరి నారాయణ రావు పరోక్షంగా బ్రూస్ లీ సినిమా వాయిదా వేసుకోవాలని సూచించారు. అయితే దాసరితో గుణశేఖర్ దంపతులు కావాలనే ఈ మాట చెప్పించారని అనుకుంటున్నారంతా. దీంతో మెగా ఫ్యాన్స్ ఎదురు దాడికి దిగారు. తమ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఉపయోగించుకున్న గుణశేఖర్ ఎందుకు ఇలా చేయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.
అయితే ఈ విషయమై మెగా అభిమానులకు నీలిమ గుణ సమాధానం ఇచ్చారు. ‘మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మా సినిమాకు ఎంతో మేలు చేసిది. మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. బ్రూస్ లీ సినిమాను వాయిదా వేయాలని మేము ఎవరినీ అడగలేదు. ఈ విషయంలో మెగా అభిమానులు అనవసర రాద్దాంతం చేయొద్దు' అని సూచించారు.