Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా అభిమానులకు జవాబిచ్చిన గుణశేఖర్ వైఫ్...
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి'. ఈ సినిమాకు నిర్మాత ఆయన భార్య నీలిమ గుణ. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 9న విడుదలైంది. ఉహించినట్లుగానే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
దాదాపు 80 కోట్ల పెట్టుబడితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దసరా సీజన్లో బరిలో పెద్ద సినిమాలు ఏమీ లేకుంటే రుద్రమదేవి పెట్టుబడి తిరిగి వచ్చి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు కేవలం వారం గ్యాపుతోనే రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కాస్త ఆందోళన నెలకొంది.
ఇటీవల ‘రుద్రమదేవి' ప్రెస్ మీట్లో పాల్గొన్న దాసరి నారాయణ రావు పరోక్షంగా బ్రూస్ లీ సినిమా వాయిదా వేసుకోవాలని సూచించారు. అయితే దాసరితో గుణశేఖర్ దంపతులు కావాలనే ఈ మాట చెప్పించారని అనుకుంటున్నారంతా. దీంతో మెగా ఫ్యాన్స్ ఎదురు దాడికి దిగారు. తమ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఉపయోగించుకున్న గుణశేఖర్ ఎందుకు ఇలా చేయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.
అయితే ఈ విషయమై మెగా అభిమానులకు నీలిమ గుణ సమాధానం ఇచ్చారు. ‘మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మా సినిమాకు ఎంతో మేలు చేసిది. మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. బ్రూస్ లీ సినిమాను వాయిదా వేయాలని మేము ఎవరినీ అడగలేదు. ఈ విషయంలో మెగా అభిమానులు అనవసర రాద్దాంతం చేయొద్దు' అని సూచించారు.