Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘గుండె జారి గల్లంతయ్యిందే’లో జాయినైన నిత్యా మీనన్
హైదరాబాద్: హీరో నితిన్కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి వీరాభిమానమో అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్ సింగ్' చిత్రంలోని సూపర్ హిట్ పాటలోని ఓ పల్లవి 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్గా పెట్టుకొని ఓ సినిమా చేస్తున్నాడు.
'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఇష్క్'కు విజయవంతమైన పాటలను అందించిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ గత నెలలోనే ప్రారంభం అయింది. నితిన్, ఇషా తల్వార్ లపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. తాజాగా నిత్యా మీనన్ కూడా షూటింగులో జాయిన్ అయింది. ఈ చిత్రం షూటింగ్ తర్వగా పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు నిత్యా మీనన్ నటించిన 'ఒక్కడినే'చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న'ఒక్కడినే' చిత్రాన్ని నవంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.