twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గుండె జారి గల్లంతయ్యిందే’లో జాయినైన నిత్యా మీనన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరో నితిన్‌కు పవన్‌ కళ్యాణ్ అంటే ఎంతటి వీరాభిమానమో అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్.. పవన్‌ కళ్యాణ్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్‌ సింగ్' చిత్రంలోని సూపర్‌ హిట్ పాటలోని ఓ పల్లవి 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఓ సినిమా చేస్తున్నాడు.

    'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్‌తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఇష్క్'కు విజయవంతమైన పాటలను అందించిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    ఈ చిత్రం షూటింగ్ గత నెలలోనే ప్రారంభం అయింది. నితిన్, ఇషా తల్వార్ లపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. తాజాగా నిత్యా మీనన్ కూడా షూటింగులో జాయిన్ అయింది. ఈ చిత్రం షూటింగ్ తర్వగా పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మరో వైపు నిత్యా మీనన్ నటించిన 'ఒక్కడినే'చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న'ఒక్కడినే' చిత్రాన్ని నవంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Nithya Menon has finally joined the cast of her upcoming Telugu film Gunde Jaari Gallanthayindhe. The film has Nitin, Nithya Menon and Isha Talwar in lead roles. Vijay Kumar Konda is directing this film and this is his debut film as a director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X