Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గుండెజారి గల్లంతయ్యిందే చిత్ర దర్శకుడిపై దాడి
యువ హీరో నితిన్తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్కుమార్ కొండాపై దాడి జరిగింది.
యువ హీరో నితిన్తో 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్కుమార్ కొండాపై దాడి జరిగింది. కొండా భార్య ప్రసూన తల్లి ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. తన కుమార్తె ప్రసూనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని విజయ్ కుమార్పై ప్రసూన తల్లి స్వరూపారాణి ఆరోపించింది. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది.
ప్రసూనను దర్శకుడు కొండా విజయ్ కుమార్ మార్చి 1 తేదీన ప్రేమ వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమించుకొంటున్న విజయ్ , ప్రసూన పెద్దల ఎదురించి ప్రేళ్లి చేసుకొన్నారు. ఈ వివాహానికి విజయ్ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
దాడి నేపథ్యంలో ప్రసూన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విజయ్కుమార్ కొండ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రసూన తల్లి దండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది.