Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మమ్మల్ని కించ పరిచారు... ‘గుండెల్లో గోదారి’పై ఫిర్యాదు
హైదరాబాద్: బ్రహ్మణుల కించ పరిచే విధంగా 'దేనికైనా రెడీ' చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఎదుర్కొన్న మోహన్ బాబు కుటుంబం, తాజాగా 'గుండెల్లో గోదారి' చిత్రం విషయంలో కూడా అలాంటి విమర్శలే ఎదుర్కొంటోంది. ఈ మేరకు 'గుండెల్లో గోదారి' చిత్రంపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సి) ఓ ఫిర్యాదు కూడా నమోదైంది.
ఈ చిత్రంలో పూసల బంగారి పాత్రను సుజా వరుణి పోషించారు. పూసల బంగారి పాత్ర చూపించిన విధానంపై 'పూసల సంఘం' వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో పూసలు అమ్మే బంగారి పాత్రను హీనంగా, అభ్యంతరకరంగా చూపెట్టడంతో పాటు, డబుల్ మీనింగ్ డైలాగులు వారని, ఇది తమ కమ్యూనిటీని అవమానించే విధంగా ఉందని ఆరోపిస్తూ పూసల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ పొదిలి గంగారాం ఈ ఫిర్యాదు చేసారు. అంతేకాకుండా రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మిని కలిసి వెంటనే ఆ సీన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ కమ్యూనిటీని కించ పరిచే విధంగా ఉన్న డైలాగులను, సీన్లను తొలగించక పోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ సంఘం నాయకులు హెచ్చరించారు. మరి మంచు ఫ్యామిలీ ఈ విషయంలో ఎలా స్పందింస్తారో? ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంచు లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతారో? చూడాలి.
నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆది, తాప్సీ, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.