Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘గుండెల్లో గోదారి’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా పండక్కే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య నిర్మాతలు ప్రకటించినా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. 2012 డిసెంబర్లో విడుదలవ్వాల్సి ఉన్నా థియేటర్ల సమస్య కారణంగా బ్రేక్ పడింది. సంక్రాంతికి విడుదల చేద్దామంటే పెద్ద సినిమాల మధ్య ఈచిన్న సినిమా నలిగిపోతుందనే భయంతో ఆ సాహసం చేయలేదు.
తాజాగా చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా వివరాల్లోకి వెళితే..... కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు.
ఇళయరాజా అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది.