Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘గుండెల్లో గోదారి’ టాకేంటి?
హైదరాబాద్ : చాలా కాలం నుంచి వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న చిత్రం 'గుండెల్లో గోదారి' ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ముందు నుంచి ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. స్టార్ యాక్టర్స్, స్టార్ టెక్నీషియన్స్ లేకపోయినా....ఇళయరాజా లాంటి గ్రేట్ మ్యూజీషియన్ సంగీతం అందించడం, మంచు లక్ష్మి, తాప్సీ నటిస్తుండటంతో కొంత మంది మాత్రం సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. డిఫరెంట్ సబ్జెక్టు అయినప్పటికీ, సినిమాలో ఎంటర్ టైన్మెంట్స్ పాళ్లు లోపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. అయితే 1986 నాటి దివిసీమ వరదలను సినిమాలో బాగా చూపెట్టారని, సినిమాటోగ్రఫీ బాగుందని టాక్.
మంచు లక్ష్మి తన అద్భుత నటను కనబర్చింది. ఆది చాలా ఎఫెక్టివ్ గా నటించాడు. తాప్సీ పాత్ర ఇంట్రస్టింగ్ గా, గ్లామరస్ గా ఉంది. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే.. అనే టాక్ వినిపిస్తోంది. జస్ట్ వన్ టైం వాచ్ అని కొందరు, అది కూడా కష్టమే అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించింది. కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. సినిమాకు ఈ సెట్ బాగా ప్లస్సయింది. 1986 నాటి వాతావరణాన్ని బాగా చూపెట్టారు.