Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంట్రస్టింగ్ : గుణ్ణం గంగరాజు సినిమా స్టోరీ లైన్ ఇదే
హైదరాబాద్ : మొదటి నుంచీ వైవిధ్యభరితమైన చిత్రాలు, టీవీ సీరియల్స్ ని రూపొందిస్తూ ముందుకు వెళ్తున్న దర్శక,నిర్మాత గుణ్ణం గంగరాజు. ఆయన తమ జస్ట్ ఎల్లో మీడియా ప్రై. లిమిటెడ్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అమృతం చందమామలో'.అవసరాల శ్రీనివాస్, హరీష్ కోయలగుండ్ల, వాసు ఇంటూరి, శివన్నారాయణ, ధన్య, సుచిత్ర కీలక పాత్రధారులు. ఈ చిత్రం టైటిల్ విన్నప్పుడు నుంచీ సినిమా కథేమిటి, ఈ సారి గుణ్ణం గంగరాజు ఏ విధమైన నవ్వులు సిద్దం చేసారు అనే ఆలోచన అందరిలో మెదిలింది.
ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ... ''ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా. చంద్రమండలంపై నడిచే కథ ఇది. అక్కడ ఓ హోటల్ పెట్టాలనుకొని బయల్దేరిన ఓ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే చిత్రం.'' అని చెప్పారు.
అలాగే... ''బుల్లితెరపై విజయవంతమైన ధారావాహిక.. అమృతం. దానికి కొనసాగింపుగా మరొకటి ఎందుకు తీయకూడదు అని చాలా మంది అడిగారు. అప్పుడే 'అమృతం... చందమామలో' ఆలోచన వచ్చింది. ఇవే పాత్రల్ని వెండితెరపైకి తీసుకెళితే పరిధి పెరుగుతుంది కదా అని కథ రాయడం మొదలుపెట్టా. ఇందులో 60 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. కామెడీ మాత్రం చవకగా ఎందుకుండాలి? అందుకే భారీగా సెట్స్వేసి చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది'' అన్నారు.
ఇక "అమృతం సీరియల్కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆరేళ్లపాటు వారానికి ఒకసారి నిర్విరామంగా ఆ సీరియల్ను ప్రసారం చేశాం. ఇప్పుడు రీ టెలికాస్ట్ అవుతోంది. అంటే దాదాపు 12 ఏళ్లుగా ఆ సీరియల్ను చూస్త్తూనే ఉన్నారు. 300 ఎపిసోడ్లకు పైగానే చేశాం. అంతకన్నా ఏం చేస్తామనుకుని ఆపేశాం. 'అమృతం'ను ఎక్కడైతే ఆపామో, అక్కడే 'అమృతం చందమామలో' సినిమాను మొదలుపెట్టాం. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. చమత్కారాలుంటాయి. ఆరు నెలలు కథ కోసం కసరత్తులు చేశాం.
ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు రసూల్ హీరో అయితే, గ్రాఫిక్స్ హీరోయిన్ అవుతాయి. చాలా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఈ తరహా సినిమాల్లో ఇది గొప్పగా ఉండాలని తెరకెక్కించాం. స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు అన్నీ ఈ సినిమాలో హైలైట్లే. చాలా రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్ను చేశాం. ఈ సినిమాకు సీక్వెల్స్ చేసే ఆలోచనల్లోనూ ఉన్నాం. 'అమృతం కంచుకోటలో' అనే కథ మైండ్లో ఉంది. ఈ నెల్లోనే 'అమృతం చందమామలో'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, రావు రమేష్, అశోక్ కుమార్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి, పాటలు: అనంతశ్రీరామ్, నృత్యాలు: విజయ్, ఫైట్స్: కింగ్ సాలమన్, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీ, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, కెమెరా: రసూల్ ఎల్లోర్, గ్రాఫిక్స్: ఈసీఎస్, లాఫింగ్ డాట్స్, నిర్మాత: ఊర్మిళ గుణ్ణం.