Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కథలు లేవంటే ఒప్పుకోను..గుణ్ణం గంగరాజు
సినిమా పరిశ్రమలో చాలా మంది కథలు లేవని, కథల కొరత వుందని అంటుంటారు. కాని కథలు వున్నాయని ఈ 'కథ' చిత్రం నిరూపిస్తుంది అంటున్నారు ప్రముఖ దర్శక, నిర్మాత గుణ్ణం గంగరాజు. జెనీలియా, అరుణ్ అదిత్ జంటగా రాగా శ్రీనివాస్ దర్శకత్వంలో జస్ట్ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న చిత్రం 'కథ'. సెన్సారు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర సమర్పకులు గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ-ఈ సినిమాకు కథే హైలైట్. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందింది. ప్రతి సన్నివేశంలోనూ నవ్యత కనిపిస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఆమె కనిపిస్తారు అన్నారు. అలాగే కథ చిత్రం కథ...జార్ఖండ్ లో మొదలయ్యే ఈ కథ అరకుతో సంబంధం ఏర్పర చుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా చిత్రం వుంటుంది. జెనీలియా చాలెంజ్గా ఫీలయ్యి చేసిన ఈ పాత్ర ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది' అన్నారు. మిగతా పాత్రల్లో ప్రకాష్రాజ్, షఫీ, రఘుబాబు తదితరులు నటించారు. సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, కళ: రవీందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: గుణ్ణం గంగరాజు.