Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గుత్తా జ్వాలాకు నెటిజన్ షాక్.. విష్ణు విశాల్తో రిలేషన్పై దారుణంగా కామెంట్
బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, తమిళ హీరో విష్థు విశాల్ మధ్య అఫైర్ వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల వారిద్దరి మధ్య చోటుచేసుకొన్న సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. లాక్డౌన్ కారణంగా వారిద్దరి మధ్య విరహం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల దిన పత్రికతో జ్వాలా గుత్తా మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వివరంగా చెప్పింది. ఆమె ఏం చెప్పారంటే..
మీ ఇద్దరు అన్నాచెల్లెల్లా?
తాజాగా సోషల్ మీడియాలో గుత్తా జ్వాలాకు ఓ నెటిజన్ తింగరి ప్రశ్నతో తికమక పెట్టించడం గమనార్హం. గుత్తా జ్వాలాపై సెటైర్లు వేస్తూ.. మీరిద్దరు అన్నాచెల్లెల్లా? అంటూ నెటిజన్ ప్రశ్నించాడు. మీ ఇద్దరికి హ్యాపీ సిబ్లింగ్స్ డే అంటూ ఝలక్ ఇచ్చాడు. దాంతో కంగారు పడిన సో ఫన్నీ అంటూ ఆమె జవాబివ్వడం గమనార్హం.
రెండేళ్లుగా మా అఫైర్
విష్ణు విశాల్తో రెండేళ్లుగా బంధం కొనసాగుతున్నది. ప్రస్తుత లాక్డౌన్ అందరిపై ప్రభావం చూపినట్టుగానే మాపై చూపిస్తున్నది. అయితే మా మధ్య మానసిక బంధం బలంగా ఉంది కాబట్టి దూరం అనే మాట రావడం లేదు. షూటింగుల బిజీతో ఆయన చెన్నైలో, నా అకాడమీ పనులతో నేను హైదరాబాద్లో బిజీగా ఉన్నాను. ఎప్పుడంటే అప్పుడు కలుసుకొనే అవకాశం ఉండేది అని గుత్తా జ్వాలా అన్నారు.
సినిమాలో మాదిరి అఫైర్ కాదు
అయితే మాది అందరి మాదిరిగా, సినిమాల్లో చూపించిన విధంగా టీనేజ్ లవ్ కాదు. మేమిద్దరం పరిణితి చెందిన వ్యక్తులం. మా మధ్య రిలేషన్షిప్లో మెచ్యురిటీ ఉంది. అప్పట్లో నేను కలువాలనుకొన్నా.. లేదా ఆయన కలువాలనుకొన్నా.. ఫ్లైట్ ఎక్కి అక్కడో ఇక్కడో వాలిపోయే వాళం. కానీ ఇప్పుడు కలుసుకోలేకపోయే చాన్స్ లేకపోవడం ప్రస్టేషన్గా ఉంది అని జ్వాలా అన్నారు.
Recommended Video
ఇలాంటి పరిస్థితి దారుణంగా
ఎన్నాళ్లు, ఎంతకాలం ఇలా క్వారంటైన్లో ఉంటామో తెలియదు. సాధారణ స్థితి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ప్రజలను ఒకేతాటిపైకి తీసుకురావడం గొప్ప విషయం. ఆ పనిని మనం చేసి చూపించాం. మంచి జరుగుతుందని ఆలోచిస్తూ.. ఎంతటి దారుణానికైనా సిద్ధం కావాల్సిందే అని జ్వాలా పేర్కొన్నారు.