అక్కడ ఓకే అయిపోయింది.. చైతు, సమంతా ఒప్పుకుంటారా!
అక్కినేని నాగ చైతన్య ఏం మాయ చేశావే చిత్రంతో తొలి హిట్ అందుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అలరించింది. సమంత ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గౌతమ్ మీనన్ తమిళంలో శింబు, త్రిషతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ కూడా ఘనవిజయమే.
తమిళంలో ఈ చిత్రం విన్నైతండి వరువాయా పేరుతో తెరకెక్కింది. ఈ చిత్ర సీక్వెల్ త్వరలో ప్రారంభం కాబోతోందని దర్శకుడు గౌతమ్ మీనన్ ఇటీవల ప్రకటించారు. మరోమారు శింబునే హీరోగా నటించబోతున్నాడు.

ఈ క్రమంలో ఏం మాయ చేశావే సీక్వెల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన వస్తే చైతు, సమంత అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం నుంచే చైతు, సమంత మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











