Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హంసానందినికి కారుకి యాక్సిడెంట్...క్షేమం
హైదరాబాద్: హంసానందిని అదృష్టవంతురాలే. ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు కారులో ప్రయాణిస్తుండగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి హంసానందిని క్షేమంగా బయటపడింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల్లో ఐటం సాంగ్ లలో నటించిన ప్రముఖ సినీనటి హంసానందినికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కడప నుంచి హైదరాబాద్కు వాహనంలో బయలుదేరారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రం మునిరంగస్వామి ఆలయసమీపంలోకి రాగానే వీరి వాహనం టైరు పగిలి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దప్రమాదం జరుగకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హంసానందిని కాలుకు స్వల్ప గాయమైంది. మరో వాహనంలో వాళ్లు వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదుకాలేదు. సిని పరిశ్రమలోని ఆమె ఆప్తులు ఆమెకు ఫోన్ చేసి పరామర్శలు చేస్తున్నారు.
అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది. తెరపై కొద్దిసేపు కనిపించినా యూత్ కి పిచ్చెక్కిస్తోంది. 'మిర్చి'లోని 'మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే' పాటకు హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. అదే జోరుతో 'భాయ్' చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. ఇప్పుడు హంసా 'రుద్రమదేవి'లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది.