Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హన్సిక స్కేర్: బిజెపిలోకి ఎస్వి శేఖర్ (పిక్చర్స్)
చెన్నై: అందాల తార హన్సిక మోట్వానీ ఎప్పుడూ లేనంతగా భీతిల్లిందట. తొలి సూపర్ నేచురల్ థ్రిల్లర్లో నటిస్తున్న హన్సికను ఆ పాత్ర భయపెడుతోందట. ఆ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్న ఆమె తాను ఎంత నెర్వెస్గా ఫీలయిందో ట్విట్టర్లో చెప్పింది.
తన పాత్రల విషయంలో ఇంతగా ఏనాడు భీతిల్లలేదని, తొలిసారి తనను నెర్వెస్నెస్ పట్టుకుందని ఆమె వ్యాఖ్యానించింది. అరన్మనాయి షూటింగ్ ప్రారంభమైందని చెప్పింది. ఈ ప్రాజెక్టులో తాను భాగస్వామిని కావడం ఉద్వేగం కలిగిస్తోందని అన్నది. ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది సూపర్ చాలెంజింగ్ రోల్ అని చెప్పుకుంది.
ఆర్య, దర్శకుడు అట్లీ కుమార్ తమ రాజా రాణి సినిమా విషయంలో ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారు పర్యటిస్తున్నారు. వారికి మంచి స్పందన లభిస్తోంది.
ప్రేక్షకులు ఆర్య జోడీ నయనతారను జైతో మిస్సవుతున్నారు. ఇటీవలి సినిమాలో జయ్ రెండో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది.
బిజెపిలో చేరిన ఎస్వి శేఖర్
నటుడు, రాజకీయ నాయకుడు సత్తనాథపురం వెంకట్రామన్ శేఖర్ అన్నాడియంకెకు రాజీనామా చేసి కొన్నేళ్ల క్రితం సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఎస్వి శేఖర్గా ప్రసిద్ధుడైన ఆయన బిజెపిలో చేరారు.
ధనుష్ను డైరెక్ట్ చేస్తున్న వెంకట్ ప్రభు
వెంకట్ ప్రభు ధనుష్ను సినిమాల్లో కాదు, కమర్షియల్లో డైరెక్ట్ చేస్తున్నాడు. యాడ్ ప్రమోషనల్ వీడియో విడుదలైంది. ఇందులో ధనుష్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నాడు.
పాండ్యనాడుకు స్పెషల్ సెట్
విశాల్ కృష్ణపై పాటను చిత్రీకరించడానికి 25 లక్షల రూపాయలతో ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేశారు. ఈ సెట్లో విశాల్, లక్ష్మీమీనన్లపై డ్యూయెట్ చిత్రీకరిస్తారు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
గౌతం కార్తిక్ సిపాయి ట్రైలర్ రిలీజ్..
తదుపరి చిత్రం సిపాయి చిత్రం విడుదల కోసం గౌతం కార్తిక్ సిద్ధమయ్యాడు. ఆయన సరసన లక్ష్మీ మీనన్ నటించింది. సోమవారం సినిమా ట్రైలర్ విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది.
నైయాంది..
పలు కారణాల వల్ల నైయాంది వార్తల్లోకి ఎక్కింది. చివరి దశలో పాజిటివ్ మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, నజ్రీయా నజీం లీడ్ రోల్స్ పోషించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతోంది