Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి..పూరీ జగన్నాధ్ తో హన్సిక రెడీ
దేశముదురు చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అయితే వారి కాంబినేషన్ మాత్రం రిపీట్ కాలేదు. అయితే తాజాగా పూరీ మరోసారి ఆమెను తన లేటెస్ట్ సినిమా గోలీమార్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోపీచంద్ హీరోగా త్వరలో మొదలయ్యే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ కొత్త చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం హన్సిక..నితిన్ సరసన సీతారాముల కళ్యాణం లంకలో అనే చిత్రంలో చేస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ సరసన ఆమె చేసిన జయీభవ భాక్సాఫీస్ వద్ద భోల్తాకొట్టడంతో తన పాత్రకు ఉండే పరిధి,విస్తృతిని కూడా తెలుసుకునే సినమాలు కమిట్ అవుతున్నట్లు సమాచారం. ఇక పూరీ రూపొందించిన ఏక్ నిరంజన్ కూడా భాక్సాపీస్ ని మెప్పించలేకపోయింది. అలాగే గోపీచంద్ శంఖం కూడా మొదటి వారానికే ధియోటర్స్ దాటి పోయింది. ఇక ఈ సారైనా ఈ ముగ్గురూ విజయాన్ని చవిచూడాలని కోరుకుందాం.