Don't Miss!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
హ్యాపీ బర్త్ డే నాగచైతన్య.. ఆకట్టుకునేలా సవ్యసాచి ఫస్ట్ లుక్
అక్కినేని నాగ చైతన్య తన జన్మదినాన్ని నవంబర్ 23న జరుపుకోనున్న నేపథ్యంలో ఈ సందర్బాన్ని పురస్కరించుకొని చైతూ నటిస్తున్న సవ్యసాచి మూవీలో ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అక్కినేని నాగ చైతన్య తన జన్మదినాన్ని నవంబర్ 23న జరుపుకోనున్న నేపథ్యంలో ఈ సందర్బాన్ని పురస్కరించుకొని చైతూ నటిస్తున్న సవ్యసాచి మూవీలో ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమానికి ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సవ్యసాచి ఫస్ట్లుక్ సూపర్బ్
సవ్యసాచి సినిమా ఫస్ట్లుక్ను చాలా సింపుల్గా సూపర్బ్గా డిజైన్ చేశారు. చైతన్య తీక్షణమైన చూపుతో ఫోటోకు అభిమానులు ఓకే చెప్పారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఆ సెట్లోనే నవంబర్ 8వ తేదీ నుంచి షూటింగ్ జరుగుతున్నది.
ప్రత్యేక పాత్రలో మాధవన్
సవ్యసాచి చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల చిత్ర యూనిట్తో మాధవన్ జత కలిశారు. 20 తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. మాధవన్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని మాధవన్ పాత్ర చాలా కాలం గుర్తుండి పోతుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.
సవ్యసాచి అద్భుతమైన చిత్రం
నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి చిత్రం గురించి మాధవన్ ఇటీవల ట్వీట్ చేశారు. అద్బుతమైన చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్కు ధన్యవాదాలు అని ట్విట్టర్లో మాధవన్ పేర్కొన్నారు.
ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో
మైత్రీ మూవీ మేకర్స బ్యానర్లో ఓ థ్రిలర్ చిత్రంగా సవ్యసాచి రూపొందుతున్నది. ఈ చిత్రం అత్యంత ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్నారు.