Don't Miss!
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
హ్యాపీ బర్త్ డే నాగచైతన్య.. ఆకట్టుకునేలా సవ్యసాచి ఫస్ట్ లుక్
అక్కినేని నాగ చైతన్య తన జన్మదినాన్ని నవంబర్ 23న జరుపుకోనున్న నేపథ్యంలో ఈ సందర్బాన్ని పురస్కరించుకొని చైతూ నటిస్తున్న సవ్యసాచి మూవీలో ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అక్కినేని నాగ చైతన్య తన జన్మదినాన్ని నవంబర్ 23న జరుపుకోనున్న నేపథ్యంలో ఈ సందర్బాన్ని పురస్కరించుకొని చైతూ నటిస్తున్న సవ్యసాచి మూవీలో ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమానికి ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సవ్యసాచి ఫస్ట్లుక్ సూపర్బ్
సవ్యసాచి సినిమా ఫస్ట్లుక్ను చాలా సింపుల్గా సూపర్బ్గా డిజైన్ చేశారు. చైతన్య తీక్షణమైన చూపుతో ఫోటోకు అభిమానులు ఓకే చెప్పారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఆ సెట్లోనే నవంబర్ 8వ తేదీ నుంచి షూటింగ్ జరుగుతున్నది.
ప్రత్యేక పాత్రలో మాధవన్
సవ్యసాచి చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల చిత్ర యూనిట్తో మాధవన్ జత కలిశారు. 20 తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. మాధవన్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని మాధవన్ పాత్ర చాలా కాలం గుర్తుండి పోతుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.
సవ్యసాచి అద్భుతమైన చిత్రం
నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి చిత్రం గురించి మాధవన్ ఇటీవల ట్వీట్ చేశారు. అద్బుతమైన చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్కు ధన్యవాదాలు అని ట్విట్టర్లో మాధవన్ పేర్కొన్నారు.
ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో
మైత్రీ మూవీ మేకర్స బ్యానర్లో ఓ థ్రిలర్ చిత్రంగా సవ్యసాచి రూపొందుతున్నది. ఈ చిత్రం అత్యంత ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్నారు.