Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను వెళ్తున్నా.. జాగ్రత్తగా చూసుకో.. కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ మాటలు!
Recommended Video
సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. గత 17 ఏళ్ల నుంచి ఆహ్వానం హోటల్లో సేవలందిస్తున్న రమణయ్య.. హరికృష్ణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. సిబ్బందితో హరికృష్ణ చెప్పిన విషయాలు ఉద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. అవేమిటంటే..
సారుక అన్నీ నేనే చూసుకొనేవాడిని
హరికృష్ణ సారుకు భోజనంలో ఏమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకొనే వాడిని. టీ, టిఫిన్లు, భోజనం, అలా ఏం కావాలన్నా నాతో చెప్పేవారు. హోటల్కు వస్తే ముందుగా నా పేరు పెట్టి పిలిచేవారు అని రమణయ్య గుర్తు చేసుకొన్నారు.
నాన్ వెజ్ అంటే ఇష్టం
హరికృష్ణ సారుకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కేఎఫ్సీ, పాపాజీ డాబా, అబిడ్స్లోని ఇతర హోటల్స్ నుంచి తనకు ఇష్టమైన భోజనాన్ని తెప్పించుకొనే వారు. ఆయనకు తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం అని రమణయ్య తెలిపారు.
ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం
ఆహ్వానం హోటల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నేను వెళ్తున్నా. జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవారు. అలాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నాను. సార్ లేకపోవడం నా దురదృష్టం అని రమణయ్య ఆవేదనకు గురయ్యారు.
హోటల్ సిబ్బందితో అనుబంధం
బుధవారం ఉదయం నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. మరణానికి ముందు మంగళవారం రాత్రి అబిడ్స్లోని ఆహ్వానం హోటల్ నుంచి ఇంటికి వెళ్లిన విషయాన్ని ఈ సందర్బంగా హోటల్ సిబ్బంది చెప్పడం గమనార్హం.