Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది : హరీష్ శంకర్
కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి జారుకున్నారు బాలు... ఆయన పాటల పూదోటలో శ్రోతలను ఓలలాడించిన ఆ రారాజు గురించి ఎంత రాసుకున్నా తక్కువే. బాల సుబ్రమణ్యం మృతిని ఆయన అభిమానులు,సినిప్రముఖులు జీర్ణించుకోలేక పోతున్నారు. . 40 వేల పాటలను 16 భాషల్లో పాడిన గాన గంధర్వుడు లేడు అంటే పాటలే చిన్నబోతాయి. అలాంటి అభిమానులు కుప్పకూలడం అంటే అతిశయోక్తి కాదు. ఆయన లేరు అనే వార్త అబద్దం అయితే బాగుండు అంటూ ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలు గురించి జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
బాలు మరణాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ప్రసారం చేస్తుంటే మన జాతీయ మీడియా మాత్రం ఎక్కడ బాలు గురించి ప్రస్తావించడం లేదు. తాజాగా హరీష్ శంకర్ స్పందిస్తూ .. జాతీయ మీడియాను చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్ లో బాలు గారి పై కథనం వచ్చింది. కాని జాతీయ మీడియాలో మాత్రం రాలేదు అనే ఉద్దేశంతో... ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్బుతంగా ప్రజెంట్ చేసిందో... మన నేషనల్ మీడియాను చూస్తే జాలేస్తుంది. అంతేలే కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ఇరుకు సందుల్లో కాదు అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు .