Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ అల్లు అర్జున్కు స్టోరీలైన్ వినిపించాడని, విన్న తర్వాత కాన్సెప్టు బాగుందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. దీంతో పాటు అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మరో వైపు హరీష్ శంకర్ ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో సమంత, శృతి హాసన్ హీరోయిన్లు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత బన్నీతో చేయబోయే చిత్రంపై దృష్టి పెట్టనున్నాడు హరీష్ శంకర్.