Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ ఫ్యాన్స్ ని భయపెడ్తున్న ఒక్క మగాడు
పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఒక్క మగాడు అనే పదం వింటే ఉలిక్కి పడుతున్నారు.దానకి కారణం పవన్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ని డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్. హరీష్ శంకర్ ఈ చిత్రం గురించి చెబుతూ..తాను పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్ ని అని, ప్రతీ అభిమాని పవన్ ని ఎలా చూడాలని కంటారో అలాగే ఈ చిత్రాన్ని రూపొందిస్తాని,ఒక ప్యాన్ డైరక్ట్ చేస్తే అలా గబ్బర్ సింగ్ ఉంటుందని అన్నారు. దాంతో అందరికీ ఒక్క మగాడు టైమ్ లో దర్శకుడు వైవియస్ చౌదరి చెప్పిన సేమ్ డైలాగ్ గుర్తుకు వచ్చింది.అప్పట్లో వైవియస్ కూడా బాలకృష్ణకు వీరాభిమాని అని...తాను ఎలా బాలయ్యన చూడాలనుకుంటాడో అలాగే చూపిస్తానంటూ ఒక్క మగాడు చిత్రం తీసి అభిమానులను భయపెట్టాడు. ఇప్పటికీ బాలకృష్ణ అభిమానులుకు వైవియస్ సినిమా అంటే భయమే. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తూండటం అందరినీ కలవల పెడుతోంది. 'గబ్బర్సింగ్' హిందీలో సూపర్ హిట్ అయిన 'దబాంగ్' ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. విలన్ గా చేస్తున్న అభిమన్యుసింగ్ తదితరులపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి పవన్కల్యాణ్ షూటింగ్ లో పాల్గొంటారు. మాస్, యాక్షన్ అంశాలతో ముడిపడిన కథ లో వినోదానికీ ప్రాధాన్యం ఉంది. ఇందులో పవన్ ఓ పోలీసు అధికారిగా కనిపిస్తారు. పవన్కి తమ్ముడిగా ఓ ముఖ్య పాత్రలో అజయ్, తల్లితండ్రులుగా సుహాసిని, నాగినీడు నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారు.