Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డీజే చిత్రం తర్వాత మరో సినిమా ప్రారంభించలేదు. కొందరు హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నించినా అది కుదర్లేదు. ఆ మధ్యన హరీష్ ఓ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అది చర్చల దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ తమిళ సూపెర్ హిట్ మూవీ జిగర్తాండని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తమిళంలో సిద్దార్థ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర విజయానికి విలన్ పాత్ర కూడా ప్రధాన కారణం. ప్రముఖ నటుడు బాబీ సింహ పోషించిన నెగిటివ్ రోల్ కు ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఆ పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నాడు. విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న వరుణ్ ప్రస్తుతం ఎఫ్2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జనవరి 27న ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుగనుంది. ప్రారంభోత్సవానికి స్టార్ సెలెబ్రిటీలు హాజరుకానున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్ర కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడట. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందట. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.