Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
‘గుండె జారి గల్లంతయ్యిందే’రైటర్ కి గోల్డెన్ ఛాన్స్
హైదరాబాద్ : విజయ్కుమార్ కొండ దర్శకత్వంలో నితిన్, నిత్యామీనన్, ఇషాతల్వార్ హీరో,హీరోయిన్ లుగా విక్రమ్గౌడ్ సమర్పణలో నిఖితారెడ్డి నిర్మించిన 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఇటీవల విడుదలై అన్ని చోట్లా ప్రజాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నటుడు, రచయిత అయిన హర్ష వర్ధన్ డైలాగులు,స్క్రీన్ ప్లే రాసారు. అతనికి నాగార్జున క్యాంప్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. నాగార్జున తన తండ్రి,కుమారుడుతో చేస్తున్న మనం చిత్రానికి డైలాగు రైటర్ గా ఆఫర్ ఇచ్చారు.
త్వరలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి 'మనం' అనే సినిమా తెరకెక్కబోతోంది.
ప్రస్తుతం 'పవిత్ర' అనే సినిమాలో మోడ్రన్ వేశ్య పాత్రలో నటిస్తున్న హీరోయిన్ శ్రియ 'మనం' సినిమాలో హీరోయిన్ గా ఎంపికయినట్లు తెలుస్తోంది. ఈచిత్రంలో శ్రియ నాగార్జునతో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. గతంలో శ్రియ నాగార్జునతో కలిసి సంతోషం, నేనున్నాను, బాస్ తదితర చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
'మనం' సినిమా వివరాల్లోకి వెళితే ఇష్క్ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సంవత్సరం ఈ చిత్రం ఫ్లోర్ మీదనకు వెళ్లనుంది. 'మనం' సినిమా తమ ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తోందని నాగార్జున ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో మూడు తరాల నటుల మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజజీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు. ప్రముఖ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ దీనికి ఫోటోగ్రఫీ అందిస్తుండగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.