Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సీన్ మారింది: రానా కాదుట...హర్షవర్దన్ రానే
హైదరాబాద్ : దగ్గుపాటి రానా హీరోగా 'అవును' చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆ పాత్రలోకి ఇప్పుడు హర్షవర్దన్ రానే వచ్చాడు. రానా..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉండటంతో హర్షవర్ధన్ ని తీసుకున్నారని చెప్తున్నారు. హిట్టైన చిత్రానికి సీక్వెల్ కావటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... రెండేళ్ల క్రితం తను రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అవును' చిత్రానికి సీక్వెల్గా మరో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు దర్శకుడు రవిబాబు ప్రారంభించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు ఒకటిన ప్రారంభమై సింగిల్ షెడ్యూల్తో పూర్తవుతుంది. ఈ సినిమాకి 'అవును 2' అని వర్కింగ్ టైటిల్ అనుకొంటున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
'అవును' చిత్రంలో జంటగా నటించిన హర్షవర్థన్ రాణే, పూర్ణ సీక్వెల్లోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 'హర్షవర్థన్ నటించిన 'మాయ' చిత్రం ఆగస్ట్ ఒకటిన విడుదల కానుంది. ఆ రోజే 'అవును 2'షూటింగ్ ప్రారంభం కావడం గమనార్హం. 'అవును'లో నటించిన ఇతర తారాగణం సీక్వెల్ లోనూ నటించనున్నారు. సరికొత్తకథ, కథానాలతో ఈ చిత్రాన్ని రవిబాబు రూపొందించనున్నారు.