Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రీతీజింటాకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ముంబయి: చెల్లని చెక్కు కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటాకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు విచారణ ప్రక్రియను కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రీతి దిగువ కోర్టులోనే విచారణ ఎదుర్కోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
'ఇష్క్ ఇన్ పారిస్' చిత్రానికి స్క్రిప్ట్ రాసినందుకు తనకు ప్రీతి రూ.18.9 లక్షల చెక్ ఇచ్చారని, అయితే అది చెల్లుబాటు కాలేదని... రచయిత అబ్బాస్ టైర్వాలా మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. గతంలోనూ ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ కేసులో ముంబై కోర్టు ఇంతకు ముందు ఆమెకు సమన్లు జారీ చేసింది. వరుసగా నాలుగు సార్లు కోర్టుకు ప్రీతి జింటా హాజరు కాలేదు. దీంతో గురువారం ప్రీతి జింటా అరెస్టుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
ఇక తాను రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటన చేసి ప్రీతి జింటా ఇంతకు ముందు వార్తల్లోకి ఎక్కారు. దేశంలోని అవినీతిని అంతం చేయడానికి తాను రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మనదేశంలో సంభవిస్తున్న పరిణామాలు చాలా విచారకరంగా ఉన్నాయని, దాంతో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ప్రీతి జింటా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశాన్ని సానుకూల దిశలో నడిపించడానికి ఏదో ఒక రోజు తాను రాజకీయాల్లోకి వచ్చి తనకు ఓటు వేయాలని కోరుతానని చెప్పారు.