twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటి విద్యా బాలన్‌కు కోర్టు ఊరట

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. విద్యా బాలన్ పై హైదరాబాద్ నల్లకుంట పోలీసులు నమోదు చేసిన కేసు విచారణపై గురువారం స్టే విధించింది.

    డర్టీ పిక్చర్ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజుల క్రితం సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆజాద్ పిటీషన్ ను సవాలు చేస్తూ విద్యా బాలన్ బుదవారం హైకోర్టులో పిటీషన్ వేసింది. తనపై విచారణ ఆపాలని కోర్టును వేడుకుంది. విద్యా పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' సినిమాలో స్మిత పాత్రను పోషించిన విద్యా బాలన్ ఏమాత్రం సిగ్గు పడకుండా హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది. ఆవిడ అందాలు, నటనకు కోట్లాది రూపాయల వసూళ్లు కూడా రాలాయి. ఏది ఏమైనా ఈ కోర్టు వివాదాలు కూడా డర్టీ పిక్చర్ పై అంచనాలు పెంచి, మరిన్ని వసూళ్లు సాధించేలా చేసిందనేది కాదనలేని వాస్తవం.

    English summary
    The High Court today stayed the investigation into the case registered against Vidya Balan, heroine of the ‘The Dirty Picture’ and Ekta Kapoor, producer of the movie till further orders.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X