Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆయన చాలా మంచి వారు అందుకే కలిశాను అంతే అది తప్పా..!
ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఓ దర్శకుడు ప్రత్యేకంగా కలసి మాట్లాడినప్పుడో , ఏదైనా దర్శకుడితో హీరో చర్చలు జరిపితేనో వారి కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ఆరంభం అవుతుందనే వార్తలు ఫిలింనగర్ లో ప్రచారం అవుతాయి. ఇలాంటి సీనే ఇటీవల కాలంలో ఒకటి జరిగింది. గోవా బ్యూటి ఇలియానా గురువారం రామ్ గోపాల్ వర్మను కలిశారు. ఐతే రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రంలో ఇలియానా కధానాయిక అనుకుంటే మాత్రం పోరపాటే అంటున్నారు. ఈ విషయాన్ని ఇలియాననే స్వయంగా ప్రకటించారు. రరామ్ గోపాల్ వర్మ గారిని కలసిన మాట వాస్తవమే, కాని ఆయనతో సినిమా చేయడం లేదు. ఏదో సరదాగా కలిశాను అంతే అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చాలా మంచి వ్యక్తి అని, మంటి సెన్సాఫ్ హ్యూమర్ కల వ్యక్తి అని అన్నారు. ఐతే చివరగా ఏ విషయం లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారిని ఈ గోవా బ్యూటీ ఎందుకు కలిసిందా అని అనుకుంటున్నారు.
కొత్తగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపోందుతున్న నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా కధానాయికగా నటిస్తున్న విషయం అందరికి తెలిసందే. ఈ సినిమా లో హీరోగా రాణా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. పోకిరి సినిమాకి ఆయనతో కలిసి పనిచేశాను. మళ్శీ ఇన్నాళ్శకు ఆయనతో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల నా పేరు మీద ఎవరో ఫేస్ బుక్ లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. అదినేను కాదు, ఆ ఎకౌంట్ ని నమ్మకండంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.