Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విషమమే :M.S నారాయణ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్లు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషయంలో కొన్ని వదంతులు చెలరేగడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇటీవల భీమవరంలో అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎంఎస్ నారాయణ వెంటే ఉన్నారు. ఎంఎస్ నారాయణను సహచరులు, సన్నిహితులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగాయి. అయితే అవన్నీ తప్పంటూ ఆయన కొడుకు విక్రమ్ తెలిపారు.
వదంతులు నమ్మొద్దని విక్రమ్ సూచించారు. కాగా గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఎంఎస్ నారాయణను కమెడియన్లు బ్రహ్మానందం, రావు రమేష్లు.. కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బ్రహ్మానందం, రావు రమేష్ పలకరించగా.. ఎంఎస్ నారాయణ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని బ్రహ్మానందం కుటుంబ సభ్యులకు సూచించినట్టు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.... ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగ నిమిత్తం వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ అని చికిత్స చేశారు.
విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం వైద్యులు తెలిపారు.
కెరీర్ విషయానికి వస్తే...
మన తెలుగు తెరపై తాగుబోతు పాత్రలంటే ముందు గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ పేరే. ఇప్పుడంటే తాగుబోతు రమేష్ వచ్చాడు కానీ ఇంతకుముందు తాగుబోతు పాత్ర అంటే ఎమ్మెస్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తనదైన కొత్త తరహా మేనరిజమ్తో ఈ తరహా పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లు దాటింది. ఈ ప్రయాణంలో 700ల చిత్రాలు పైగా పూర్తి చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు ఎమ్మెస్ నారాయణ.
ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పారు.
ఇక మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.
అలాగే... సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.