Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాగరకన్య గెటప్ లో భలే ఉంది(ఫొటో)
హైదరాబాద్ : సాహసవీరుడు ...సాగర కన్య అంటూ అప్పట్లో రాఘవేంద్రరావు గారి దర్సకత్వంలో వెంకటేష్ హీరో గా ఓ చిత్రం వచ్చింది. సినిమా ఫ్లాఫ్ అయినా..అందులో శిల్పాశెట్టి..సాగర కన్య గెటప్ లో కనిపించి అలరించటం ఎవరూ మర్చిపోరు. ఆ తర్వాత అలాంటి సాగర కన్య గెటప్ లు ఏ హీరోయినూ వేయనూ లేదు...దర్సకులు ఫ్లాఫ్ భయంతో అలాంటి సబ్జెక్టులూ పట్టుకోలేదు. అయితే ఇప్పుడు హార్ట్ ఎటాక్ చిత్రం భామ అదా శర్మ..అలాంటి గెటప్ లో కనిపించి ఇప్పుడు కనువిందు చేస్తోంది.
ఈ సాగర కన్య గెటప్ ..ఏదో సినిమా కోసం అనుకునేరు. అలాంటిదేం లేదు. ఆమె పెటా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. పెటా సంస్ధ ప్రచారంలో భాగంగా ఇలా ఆమె గెటప్ ఛేంజ్ చేసుకుని..జంతువులపై ప్రేమ పెంచుకోండని చెప్తోంది.
నితిన్ సరసన 'హార్ట్ ఎటాక్'లో హీరోయిన్గా నటించిన అదా తన అందచందాలు, నటనతో ఆకట్టుకొంది. విక్రమ్భట్ తీసిన '1920'తో వెండితెరపై కాలుపెట్టిన అదా శర్మ, దాని తర్వాత 'ఫిర్', 'హమ్ హై రాహీ కార్ కే', 'హసీ తో ఫసీ' వంటి చిత్రాల్లో నటించింది. కన్నడంలో 'ధీర రాణా విక్రమ'లోనూ హీరోయిన్ గా చేసింది.
'హార్ట్ ఎటాక్' తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తాయని చాలామంది భావించారు. కానీ ఇంతవరకు ఆమె మరే తెలుగు సినిమాకూ సంతకం చేసిన దాఖలా లేదు. పెద్ద సినిమాలు అయితేనే చేస్తానని ఆమె కూర్చుంది. కొందరు ఆమెను సెకండ్ హీరోయిన్ గా అడిగినా తిరస్కరించిందని తెలుస్తోంది. రెమ్యునేషన్ వద్ద పట్టువిడుపు లేకపోవటం కూడా తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవటానికి కారణమని చెప్తారు.
మరో ప్రక్క హిందీ ఎంటర్టైన్మెంట్ చానల్ 'లైఫ్ ఓకే' కోసం బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా తీయబోతున్న సీరియల్లో హీరోయిన్ గా నటించేందుకు ఆమె అంగీకరించింది. ఎంటీవీ వీజేగా పాపులర్ అయిన రణ్విజయ్సింగ్ జోడీగా ఈ సీరియల్లో కనిపించనుంది అదా. ఓ పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందే ఈ సీరియల్లో రణ్విజయ్ తండ్రిగా సీనియర్ బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ నటించనుండటం విశేషం.