Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమ
హైదరాబాద్: భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని తాను కోరుకుంటున్నానను, వస్తుందనే నమ్మకం ఉంది...అందకే రాజమండ్రి- రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు నటి హేమ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం వచ్చిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నాను. జిల్లాలో సినిమా షూటింగ్స్కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు.
ఇటీవల ‘మా' ఎన్నికల నేపథ్యంలో హేమ, శివాజీ రాజా మధ్య గొడవ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ విషయమై హేమ స్పందిస్తూ....‘మా' ఎన్నికల సందర్భంగా పోటీ వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే. ఆ వేడి ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. ‘మా'లో ఎలాంటి విబేధాలు లేవు అన్నారు.
గత 25 ఏళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నాను. ఏడో తరగతి చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. భలేదొంగలు సినిమాలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను అన్నారు. ఇంతవరకూ 465 సినిమాల్లో నటించాను అని తెలిపారు.