Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో గోపీచంద్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు,ఎందుకో తెలుసా?
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం పంతం. ఫర్ ఎ కాస్ ఉప శీర్షిక. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మేహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బలుపు, పవర్, జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
గోపీచంద్ నటిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 5న సినిమాను రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సందేశం తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చక్రవర్తి. దీన్ని బట్టి చుస్తే గోపీచంద్ జనాలకు ఒక మెసేజ్ ఎవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ పూర్తయిన తర్వాత యు.కెలో కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించబోతున్నారు. చిత్ర షూటింగ్ ఒకవైపు జరుగుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది ఈ సినిమా.