Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో గోపీచంద్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు,ఎందుకో తెలుసా?
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం పంతం. ఫర్ ఎ కాస్ ఉప శీర్షిక. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మేహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బలుపు, పవర్, జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
గోపీచంద్ నటిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 5న సినిమాను రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సందేశం తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చక్రవర్తి. దీన్ని బట్టి చుస్తే గోపీచంద్ జనాలకు ఒక మెసేజ్ ఎవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ పూర్తయిన తర్వాత యు.కెలో కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించబోతున్నారు. చిత్ర షూటింగ్ ఒకవైపు జరుగుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది ఈ సినిమా.