Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హీరో కారు వెనక ప్యాన్స్ ఫాలో...ఇబ్బంది
ఈ తమిళ హీరో 'ఆవారా', 'నా పేరు శివ', 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నటించిన 'బ్యాడ్బాయ్' చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ''కథను బట్టి హీరో పాత్ర ఉండాలి కానీ కథానాయకుడికి తగ్గట్టు కథ ఉండదు. ఒకవేళ ఉన్నా అది అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. కథలోని ఆ పాత్రలో నేను ఎంతవరకూ సరిపోతానో చూసుకుంటానంతే. ఒక వేళ నేను చేయగలిగితే అందుకోసం ఎంత కష్టమైనాపడతాను'' అంటున్నారు కార్తి.
ఇక ''శకుని తరవాత విరామం వచ్చిన మాట వాస్తవమే. సరైన సినిమాలు కుదరక ఆలస్యం అయింది. స్వతహాగా ఇంత విరామం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు. శకుని తర్వాత నా సినిమా రావడం ఆలస్యం అయినా 'బ్యాడ్బాయ్' ఆ లోటుని తీరుస్తుంది.'' అన్నారు.
చిత్రం గురించి చెప్తూ...''నిజ జీవితంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి. మంచి అబ్బాయి పాత్రలు తరచూ చేస్తుంటాం. చెడ్డ అబ్బాయిగా కూడా నటించడంలోనే కిక్ ఉంటుంది. ఇలాంటి పాత్రల్లోనే నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే బ్యాడ్బాయ్ చిత్రాన్ని అంగీకరించాను. డబ్బు సంపాదించడమే లోకంగా బతికే యువకుడి కథ ఇది. అనుకోకుండా ఓ యువతి అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె ప్రభావంతో అతను మంచివాడిగా మారాడో లేదో అనేది తెరపైనే చూడాలి. అటు మాస్నీ, ఇటు యువతనీ ఆకట్టుకొనే అంశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పరిగెట్టే రైలుపై చేసిన పోరాట సన్నివేశం మరచిపోలేనిది. ఆ సన్నివేశానికి ముందు చాలా కసరత్తు చేశాను.'' అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఎస్.శరవణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎన్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: సురాజ్.