Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో కారు వెనక ప్యాన్స్ ఫాలో...ఇబ్బంది
ఈ తమిళ హీరో 'ఆవారా', 'నా పేరు శివ', 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నటించిన 'బ్యాడ్బాయ్' చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ''కథను బట్టి హీరో పాత్ర ఉండాలి కానీ కథానాయకుడికి తగ్గట్టు కథ ఉండదు. ఒకవేళ ఉన్నా అది అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. కథలోని ఆ పాత్రలో నేను ఎంతవరకూ సరిపోతానో చూసుకుంటానంతే. ఒక వేళ నేను చేయగలిగితే అందుకోసం ఎంత కష్టమైనాపడతాను'' అంటున్నారు కార్తి.
ఇక ''శకుని తరవాత విరామం వచ్చిన మాట వాస్తవమే. సరైన సినిమాలు కుదరక ఆలస్యం అయింది. స్వతహాగా ఇంత విరామం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు. శకుని తర్వాత నా సినిమా రావడం ఆలస్యం అయినా 'బ్యాడ్బాయ్' ఆ లోటుని తీరుస్తుంది.'' అన్నారు.
చిత్రం గురించి చెప్తూ...''నిజ జీవితంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి. మంచి అబ్బాయి పాత్రలు తరచూ చేస్తుంటాం. చెడ్డ అబ్బాయిగా కూడా నటించడంలోనే కిక్ ఉంటుంది. ఇలాంటి పాత్రల్లోనే నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే బ్యాడ్బాయ్ చిత్రాన్ని అంగీకరించాను. డబ్బు సంపాదించడమే లోకంగా బతికే యువకుడి కథ ఇది. అనుకోకుండా ఓ యువతి అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె ప్రభావంతో అతను మంచివాడిగా మారాడో లేదో అనేది తెరపైనే చూడాలి. అటు మాస్నీ, ఇటు యువతనీ ఆకట్టుకొనే అంశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పరిగెట్టే రైలుపై చేసిన పోరాట సన్నివేశం మరచిపోలేనిది. ఆ సన్నివేశానికి ముందు చాలా కసరత్తు చేశాను.'' అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఎస్.శరవణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎన్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: సురాజ్.