Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
న్యూస్ రిపోర్టర్ గా కనిపించబోతున్న హీరో నిఖిల్ !
నిఖిల్ హీరోగా ఠాగూర్ మధు ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టి.ఎన్.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ను ఖరారు చేశారు. గతంలోనే ఈ సినిమాకు ముద్ర టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు.
సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. ఎందుకంటే తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించిన కారణంగా ఈ మూవీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 5 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
కనితన్ పేరుతో తమిళ్ లో విడుదలైన ఈ సినిమా ఆక్కడ మంచి హిట్ సినిమాగా నిలిచింది. తాజా సమాచారం మేరకు నిఖిల్ ఈ రీమేక్ లో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.