Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
న్యూస్ రిపోర్టర్ గా కనిపించబోతున్న హీరో నిఖిల్ !
నిఖిల్ హీరోగా ఠాగూర్ మధు ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టి.ఎన్.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ను ఖరారు చేశారు. గతంలోనే ఈ సినిమాకు ముద్ర టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు.
సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. ఎందుకంటే తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించిన కారణంగా ఈ మూవీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 5 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
కనితన్ పేరుతో తమిళ్ లో విడుదలైన ఈ సినిమా ఆక్కడ మంచి హిట్ సినిమాగా నిలిచింది. తాజా సమాచారం మేరకు నిఖిల్ ఈ రీమేక్ లో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.