Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో సప్తగిరిపై వస్తున్న వార్తలు అవాస్తవం.. డైరెక్షన్ చేయడం లేదు!
Recommended Video
కమెడియన్గా తనదైన హాస్యంతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన సప్తగిరి హీరోగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రాలు ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్నమైన కథాంశాలతో మరికొన్ని చిత్రాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సప్తగిరి దర్శకుడిగా మారబోతున్నారనే వార్త మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంపై తెలుగు ఫిల్మీబీట్కు సప్తగిరి పీఆర్ టీం వివరణ ఇచ్చింది.
సప్తగిరి ఎల్ఎల్బీ తర్వాత గ్యాప్ తీసుకొన్న సప్తగిరి మరో మూడు సినిమాలతో బిజీగా మారనున్నారు. ఆయనకు దర్శకుడిగా మారే ఆలోచన లేదు. దర్శకుడిగా మారబోతున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నిరాధారమైన వార్తలను నమ్మకూడదు అని సప్తగిరి పీఆర్ టీం వెల్లడించింది.
సప్తగిరి ఎల్ఎల్బీ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ మంచి కథ కోసం ఆగాల్సి వచ్చింది. త్వరలోనే సప్తగిరి హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నది. మరో రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి అని వారు పేర్కొన్నారు.
గతంలో పరుగు అనే సినిమాకు సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సినిమా పరిశ్రమలోని పలు విభాగాలపై ఆయనకు పట్టు ఉందని విషయం తెలిసిందే.