Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
హీరో సప్తగిరిపై వస్తున్న వార్తలు అవాస్తవం.. డైరెక్షన్ చేయడం లేదు!
Recommended Video
కమెడియన్గా తనదైన హాస్యంతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన సప్తగిరి హీరోగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రాలు ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్నమైన కథాంశాలతో మరికొన్ని చిత్రాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సప్తగిరి దర్శకుడిగా మారబోతున్నారనే వార్త మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంపై తెలుగు ఫిల్మీబీట్కు సప్తగిరి పీఆర్ టీం వివరణ ఇచ్చింది.
సప్తగిరి ఎల్ఎల్బీ తర్వాత గ్యాప్ తీసుకొన్న సప్తగిరి మరో మూడు సినిమాలతో బిజీగా మారనున్నారు. ఆయనకు దర్శకుడిగా మారే ఆలోచన లేదు. దర్శకుడిగా మారబోతున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నిరాధారమైన వార్తలను నమ్మకూడదు అని సప్తగిరి పీఆర్ టీం వెల్లడించింది.
సప్తగిరి ఎల్ఎల్బీ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ మంచి కథ కోసం ఆగాల్సి వచ్చింది. త్వరలోనే సప్తగిరి హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నది. మరో రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి అని వారు పేర్కొన్నారు.
గతంలో పరుగు అనే సినిమాకు సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సినిమా పరిశ్రమలోని పలు విభాగాలపై ఆయనకు పట్టు ఉందని విషయం తెలిసిందే.