Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బ్లఫ్ మాస్టర్గా సత్యదేవ్.. నందితాశ్వేతతో కలిసి..
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన చతురంగ వేట్టై చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది . అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత .గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు . జ్యోతిలక్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు . ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక.
నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం చతురంగ వేట్టై, తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్,కర్నూలు ,వైజాగ్, హైదరాబాద్లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వేల్యూస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున , చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది అని అన్నారు.
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ రోజూ ఏ దినపత్రిక చదివినా , ఏ టీవీ ఛానల్ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి . మనిషికి ఆశ సహజం . కానీ అది అత్యాశగా మారినప్పుడే ఘోరాలు , నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు .ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది అని చెప్పారు.
ఆదిత్యామీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్య కృష్ణ, ధన్రాజ్, శ్రీరామరెడ్డి , వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, దిల్ రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి.వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, సంగీతం: సునీల్ కాశ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: బ్రహ్మ కడలి, కెమెరా: దాశరథి శివేంద్ర , కో డైరక్టర్: కృష్ణకిశోర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: ఆర్.సెంథిల్, కృష్ణకుమార్,నిర్మాత: రమేష్ పిళ్లై, మాటలు -దర్శకత్వం: గోపీగణేష్ పట్టాభి.