ఆ నిర్మాతలకు యువహీరో శర్వానంద్ సూచన!
హీరోగా సక్సెస్ ఫుల్ జర్నీని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. కాని శర్వానంద్ వరుస సక్సెస్ సినిమాలతో దుసుకెల్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ హీరో మరిన్ని సినిమాల్లో నటించబోతున్నాడు. కథ, కథనం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నాడు.
Recommended Video


సాయి పల్లవి హీరోయిన్ గా
శర్వానంద్ హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న చిత్రం "పడి పడి లేచే మనసు". 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' వంటి సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సునీల్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నాడు. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

రెండు విభిన్న పాత్రల్లో
శర్వానంద్ హను రాఘవపూడి సినిమాతో పాటు స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శర్వానంద్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.

సుదీర్ వర్మ సినిమాలో కాజల్
ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాక శర్వానంద్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుదీర్ వర్మ సినిమాలో కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

వేణు ఊడుగుల , శ్రీకాంత్ అడ్డాల
శర్వానంద్ ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందులో మొదటిది దర్శకుడు వేణు ఊడుగుల సినిమా మరొకటి శ్రీకాంత్ అడ్డాల సినిమా. త్వరలో ఈ సినిమాలకు సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కథ పూర్తి స్థాయిలో బాగుంటేనే శర్వానంద్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాడని సమాచారం. హను రాఘవపూడి సుదీర్ వర్మ సినిమాలు తప్పా ఏ సినిమాను ఒప్పుకోలేదని సమాచారం. తన మార్కెట్ ను బట్టి సినిమాకు బడ్జెట్ పెట్టమని, ఎక్కువగా ఖర్చు పెట్టొద్దని నిర్మాతలకు శర్వానంద్ చెబుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











