Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీడియా లో కనపడాలనే పిచ్చితో...
ఏదో మీడియాలో కనిపించాలన్న తాపత్రయమే కొత్తగా వచ్చిన నిర్మాతలలో ఎక్కువగా కనిపిస్తోంది. వారు సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. సరైన ప్రణాళికలు ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్లు మానసికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశం కాదు. నా విధి అంతే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు హీరో శివాజి. తన సినిమాలు వరసగా ఫ్లాఫ్ అవటాన్ని విశ్లేషిస్తూ ఆయన ఇలా చెప్పుకొచ్చారు. కొత్త నిర్మాతల్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడున్న ఉత్సాహం గుమ్మడికాయ కొట్టడంలో కనిపించడం లేదు. అది దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య సినిమాలు కూడా పెద్దగా ఒప్పుకోవట్లేదు.
కథ నచ్చి, సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తారన్న నమ్మకం కుదిరితే తప్పకుండా సినిమాలను అంగీకరిస్తాను. పెద్ద హీరోల చిత్రాల్లో ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమేనని శివాజి మీడియాకు చెప్పుకొచ్చారు. తన చిత్రాల ఫ్లాప్ ఫలితాల ప్రస్తావన వచ్చినప్పుడు-డైరీ, ఇందుమతి, పెళ్లి కాని ప్రసాద్, మా ఆయన చంటిపిల్లాడు..ఇవన్నీ ప్రచార లోపం వల్ల డీలా పడ్డ సినిమాలే. నిజానికి ఆర్థిక మాంద్యం సినిమా పరిశ్రమను తాకలేదు. ఒకవేళ ఆ మాంద్యమే ఉండి ఉంటే వారానికి మూడు సినిమాలు విడుదల కావు అన్నారు. ప్రస్తుతం శివాజీ తానే నిర్మాతగా మారి తాజ్ మహల్ అనే కన్నడ రీమేక్ చిత్రాన్నిప్రొడ్యూస్ చేస్తున్నారు.