Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సగం సినిమా ఎలా? నిర్మాతలు మోసం చేసారు: శ్రీ
హైదరాబాద్: సగం పూర్తయిన సినిమాని రిలీజ్ చేస్తారా? 30 రోజుల టాకీ అని చెప్పి 17 రోజులే టాకీ తీసారు. ఇలాంటి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు?' అంటూ వివాదానికి తెరతీసారు హీరో శ్రీ. ఈ యువ హీరో నటించిన తాజా సినిమా ‘నారి నారి శ్రీ మురారి' నిర్మాతలు తనని మోసం చేసారని శ్రీ ఆరోపించారు.
హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ మాట్లాడుతూ...‘నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల సగం రోజులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ విషయాన్ని చాలా కాలం వరకూ చెప్పనేలేదు. మాట్లాడాలని ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా సగం సినిమా ఆడియోని రిలీజ్ చేసి...ఈ నెల 13న రిలీజ్ అంటున్నారని తెలిపారు.
నిర్మాతకు ఫోన్ చేస్తే సంతృప్తికర సమాధానం లేదు. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పించారు. పైగా నా పేరుతో టైటిల్ పెట్టారు. ఇదంతా షాక్కి గురి చేసింది. పై విషయాలేవీ కెరీర్ పై ప్రభావం పడకూడదని మీతో చెబుతున్నా. పంపిణీదారులు, బయ్యర్లు శాటిలైట్ రైట్స్ కొనుక్కునేవాళ్లు ఈ విషయాన్ని గమనించగలరు. కథ, కథనం లేకుండా సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర జయాపజయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు' అన్నారు.
‘ఈరోజుల్లో..' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ ఆ తర్వాత....పలు చిత్రాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. చాలా కాలం తర్వాత వివాదంతో వార్తల్లోకి ఎక్కారు శ్రీ.