Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనాపై పోరాటం.. సీసీసీకి హీరో శ్రీకాంత్ విరాళం
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రణాళికలు రచిస్తున్నాయి. లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలను ఇల్లుదాటి బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని నిరోధిస్తున్నాయి.
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన నింపుతున్నారు. సీఎం, పీఎం సహాయ నిధులకు ఆర్థిక సాయం చేయడమే గాక సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. చిరంజీవి సారథ్యంలో ఏర్పడిన ఈ ఛారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు తెలుగు సినీ తారలు.
ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ సహా ఎందరో సినీ హీరోలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించగా.. తాజాగా హీరో శ్రీకాంత్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందజేసారు శ్రీకాంత్. సరైన సమయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న పెద్దలందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన శ్రీకాంత్.. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్స్ చేసి కూడా మెప్పించారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమాలో కూడా ఈయనే విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.