Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టేజిపై డ్యూయెల్ రోల్.. మహేష్కి రావడం కుదర్లేదు.. మళ్లీ అదే డైలాగ్ కొట్టిన సుధీర్ బాబు!
Recommended Video
సుధీర్ బాబు వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మూడు నెలల క్రితం సమ్మోహనం చిత్రంతో విజయం అందుకున్న సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువటే చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 21 న విడుదల కాబోతోంది. సుధీర్ బాబు స్వయంగా నిర్మించి నటించిన చిత్రం ఇది. కన్నడ భామ నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్. నభా నటేష్ కు ఇది తెలుగులో డెబ్యూ మూవీ. మంగళవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అటు నిర్మాతగా, ఇటు హీరోగా డ్యూయెల్ రోల్ లో సుధీర్ బాబు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.
డ్యూయెల్ రోల్
తాను ఇప్పుడు సుధేర్ బాబుని కాదని.. సుధీర్ బాబు అనే నిర్మాతని అంటూ ప్రసంగించారు. నేను మాట్లాడిన తరువాతే మా హీరో సుధీర్ బాబు మాట్లాడతాడని నవ్వులు పూయించారు. ఈ చిత్రం తరువాత చాలా మంది నిర్మాతలు హీరోయిన్ నంబర్ కోసం నా మేనేజర్ కు ఫోన్ చేస్తారని నభా నటేష్ గురించి తెలిపాడు.
చాలా కష్టం
నిర్మాతగా మాట్లాడిన తరువాత హీరోగా కూడా సుధీర్ బాబు మాట్లాడాడు. అటు నిర్మాతగా, హీరోగా రెండు పనులు ఒకేసారి చేయడం ఎంత కష్టమో వివరించేందుకే ఇలా చేసానని తెలిపాడు. ఎంతకష్టమైనా ఈ పనిని తాను ఇష్టపడి చేశానని సుధీర్ బాబు తెలిపాడు.
హిట్ ఖాయం
సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ అవుతుందనే ధీమా ఉందని సుధీర్ తెలిపాడు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కూడా వచ్చారు. నాకు ప్రతి విషయంలో మీరు సపోర్ట్ అందిస్తున్నారు. ఈ మద్దత్తుతోనే ఈ చిత్రాన్ని నిర్మించానని, సినిమా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ కు కూడా చెప్పాలని కోరాడు.
మహేష్ని ప్రతిసారి
మహేష్ కి రావడం కుదరలేదు. ప్రతిసారి ఇబ్బంది పెడితే బాగోదు కదా అని సుధీర్ బాబు తెలిపాడు. సమ్మోహనం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన డైలాగ్ ని సుధీర్ బాబు మళ్ళీ చెప్పాడు. ఈ చిత్రాన్ని పైరసీలో చూసి ఆ మిగిలిన డబ్బులతో ఏదైనా తింటే మీకు అరగదు అంటూ పైరసీలో సినిమా చూడొద్దని కోరాడు.