Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఇలాంటి సమయంలో ఓ మంచి సినిమా.. అక్కినేని హీరో కామెంట్
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. కెరీర్లో ఫీల్ గుడ్ మూవీస్లో నటించి ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సత్యం, గోదావరి, గోల్కోండ హైస్కూల్, మళ్లీ రావా వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అన్నింట్లోకెల్లా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా వచ్చి 14యేళ్లు అవుతున్న సందర్భంగా.. హీరో సుమంత్ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.
ప్రస్తుతం అంతా లాక్డౌన్ను పాటిస్తున్నారు. ఈ ఖాళీ సమయాన్ని అందరూ చక్కగా వినియోగించుకుంటున్నారు. సెలెబ్రిటీలందరూ కొత్త కొత్త వెబ్సిరీస్లంటూ వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని హీరో సుమంత్ ఓ సినిమాను సజెస్ట్ చేశాడు. తాను నటించిన ఓ చిత్రాన్ని చూడమని సలహా ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు.
గోదావరి చిత్రం రిలీజై నేటికి పద్నాలుగేళ్లు అవుతోంది. నాకు ఇప్పుడు ఎలాంటి పని లేదు కాబట్టి..నేటి ఉదయం కాఫీ సమయంలో నేను మళ్లీ ఈ సినిమా చూశాను. ప్రత్యేకంగా ఇలాంటి కఠిన సమయంలో ఈ సినిమా మళ్లీ ఏదో కొత్త ఫీలింగ్ కలిగించింది. మీరు ఇంత వరకు ఈ సినిమాను చూడకపోతే.. ఓ సారి చూడండి. కష్టకాలంలో ఓ మంచి సినిమా. శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు. జీ5, యూట్యూబ్లో ఉంద'ని చెప్పుకొచ్చాడు.