Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. వధువు ఎవరో తెలుసా?
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు కుమారుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు మీ కోసం..
లవ్లో సుమంత్ అశ్విన్, దీపిక
సుమంత్ అశ్విన్, దీపికా రాజు గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వారి ప్రేమకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలియజేయడంతో మ్యారేజ్కు లైన్ క్లియర్ అయింది. దాంతో వారి పెళ్లిని ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి నిర్వహించారు. పెళ్లి తర్వాత మొదటి రోజు వాలంటైన్ కావడంతో వధూవరులు ఆ పండుగను సెలబ్రేట్ చేసుకొన్నట్టు తెలిసింది.
నిరాడంబరంగా సుమంత్ పెళ్లి
యువ హీరో సుమంత్ అశ్విన్, దీపికా రాజు పెళ్లి హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్హౌస్లో జరిగింది. పెళ్లికి హాజరైన 100 మంది అతిథులు నూతన దంపతులను శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ రంగానికి చెందిన అతికొద్ది మాత్రమే హాజరైనట్టు సమాచారం.
జీవిత భాగస్వామి లభించడం
తన పెళ్లి తర్వాత సుమంత్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ.. లైఫ్లోకి మంచి జీవిత భాగస్వామి లభించడం గొప్ప అనుభూతి. కొత్త జీవితాన్ని ప్రారంభించడం మరింత ఆనందంగా ఉంది. భవిష్యత్తో దీపికతో పంచుకొనే జీవితం గురించి ఆసక్తిగా ఉంది అని సుమంత్ తెలిపారు.
తొలి చూపులోనే ప్రేమలో పడ్డ సుమంత్
దీపికతో పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి సుమంత్ అశ్విన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గతేడాది నా కజిన్ తన సోదరిని వివాహం చేసుకొన్నారు. ఆ పెళ్లికి నేను వెళ్లాను. ఆ పెళ్లిలోనే దీపిక నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అని సుమంత్ తెలిపారు.
అమెరికాలో సైంటిస్ట్గా దీపికా రాజు
ఇక దీపిక రాజు విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె డల్లాస్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం దీపిక సైటింస్ట్గా పనిచేస్తున్నారు.