Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సందీప్ కిషన్ కొత్త చిత్రం.. వంశీకృష్ణ దర్శకత్వంలో..
‘బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉహేలి (బెంగాలీ) చిత్రాల నిర్మాతల్లో రూపేష్ డీ గోహిల్ ఒకరు. తాజాగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా సోలో నిర్మాతగా సినిమాను రూప
'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం', 'సినిమా చూపిస్త మావ', 'ఉహేలి (బెంగాలీ) చిత్రాల నిర్మాతల్లో రూపేష్ డీ గోహిల్ ఒకరు. తాజాగా యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా సోలో నిర్మాతగా సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకొన్న వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ తాజా సినిమా రూపొందనున్నది.
ఈ సందర్భంగా నిర్మాత రూపేష్ డీ గోహిల్ మాట్లాడుతూ ఇంతకు మునుపు పార్ట్ నర్ షిప్తో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, సినిమా చూపిస్త మావ, ఉహేలి (బెంగాలీ) అనే సినిమాలను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి అభిరుచి ఉన్న సినీ కథా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ నచ్చింది. సకుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువలున్న వినోదాత్మక చిత్రమవుతుంది అని అన్నారు.
జులై 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగాన్ని హైదరాబాద్లోనే తెరకెక్కిస్తాం. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: రథన్, కెమెరా: భలే భలే మగాడివోయ్ ఫేమ్ నిజర్ షఫి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్